మిషన్ భగీరథను ప్రారంభించనున్న మోదీ
Published Friday, 29 July 2016హైదరాబాద్, జూలై 28: అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 7వ తేదీన మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 3 గంటలకు మెదక్ జిల్లా గజ్వేల్కు చేరుకుంటారు. అక్కడ మిషన్ భగీరథ తొలి దశను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.