కడియం, లక్ష్మారెడ్డిలను తొలగించాలి
Published Friday, 29 July 2016హైదరాబాద్, జూలై 28: ఎమ్సెట్-2 లీకేజికి బాధ్యత వహించి మంత్రులు కడియం శ్రీహరి, డాక్టర్ లక్ష్మారెడ్డిలను మంత్రి పదవుల నుంచి తొలగించాలని, లేదా వారు రాజీనామా చేయాలని గురువారం టిపిసిసి డిమాండ్ చేసింది. టిపిసిసి వర్కింగ్ అధ్యక్షుడు భట్టివిక్రమార్క విలేఖర్లతో మాట్లాడుతూ ఈకేసులో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్సెట్-2 లీకేజి వెనక టిఆర్ఎస్ నేతల హస్తం ఉందన్నారు. ఈ లీకేజీ విషయమై రాష్ట్రప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని డిస్మిస్ చేయాలని, సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.