న్యాయాధికారులపై సస్పెన్షన్ ఎత్తివేత
Published Friday, 29 July 2016హైదరాబాద్, జూలై 28: న్యాయాధికారుల కేటాయింపు సందర్భంగా జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న 11 మంది తెలంగాణ న్యాయాధికారులపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తూ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. సస్పెండైన వారిలో న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు కె రవీందర్ రెడ్డి, కార్యదర్శి వి వరప్రసాద్ తదితరులు ఉన్నారు. ఆంధ్ర స్థానికత ఉన్న న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ న్యాయాధికారులు గత నెలలో రాజ్భవన్ వరకు ర్యాలీ నిర్వహించిన విషయం విదితమే. అనంతరం తెలంగాణ న్యాయాధికారులు ఈ అంశాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు.