పెండింగ్ పనులు వేగవంతం చేయాలి
Published Friday, 29 July 2016పాములపాడు, జూలై 28:ప్రాజెక్టు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్కుమార్రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆదేశించారు. ఎస్ఎంసి విస్తరణ పను ల్లో భాగంగా నిర్మాణంలో ఉన్న 24వ ప్యాకేజీ వంతెన, ఎస్ఆర్బిసి బానకచెర్ల రెగ్యులేటర్ వద్ద అదనపు గేట్ల పనులను గురువారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాలపై ఎన్నో అనుమానాలు ఉండేవని వాటిని సమయం లోగా పూర్తి చేశామన్నారు. అలాగే ఈ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని వివరించారు. ఈ పనులపై సిఎం చంద్రబాబు దృష్టి సారించారని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారన్నారు. ఈ ఏడాది అదనపు గేట్ల నుంచి కనీసం 10వేల క్యూసెక్కుల నీరు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్ఆర్బిసిపై స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టక పోవడంతో ఈ ప్రాంతంలో కెసి ఆయకట్టు బీడుగా మారే ప్రమాదం ఉందన్నారు. నష్టపోయిన రైతాంగానికి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయ న హామీ ఇచ్చారు. వారి వెంట ఎస్ఇ రామచంద్రయ్య, ఇఇలు గంగయ్య, శ్రీనివాసరెడ్డి, డిఇలు, ఏఇలు, కడప జిల్లా టిడిపి నాయకులు పాల్గొన్నారు.