S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తల్లీకూతుళ్ల హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

కర్నూలు, జూలై 28:తల్లీకూతుళ్ల హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న వ్యాస్ ఆడిటోరియంలో గురువారం ఎస్పీ విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. గూడూరు గ్రామానికి చెందిన బోయ మద్దమ్మతో పాటు ఆమె కుమార్తె బోయ లక్ష్మి(8)లను ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతాల్లో గూడూరు గ్రామానికి చెందిన బోయ తలారి రంగడు, కల్లూరు మండలం ఎర్రకత్వ గ్రామానికి చెందిన బోయ చిన్నగిడ్డయ్య తల్లీ కూతుళ్లను వేర్వేరు ప్రాంతాల్లో హత్య చేసినట్లు తెలిపారు. మద్దమ్మను వెల్దుర్తి బ్రహ్మగుండం దగ్గర రవ్వలకొండపై, లక్ష్మిని కల్లూరు మండలం ఎర్రకత్వ గ్రామం వద్ద పాడుబడిన ఒక గదిలో హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఎర్రకత్వ గ్రామానికి చెందిన గిడ్డయ్య, మద్దమ్మతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న గూడూరుకు చెందిన రంగడు కలిసి హత్య చేసినట్లు తేలిందన్నారు. వారిని గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో వెల్దుర్తి మండలం అల్లుగుండు పెట్రోల్‌బంక్ సమీపంలో అరెస్టు చేసి వారి నుంచి రూ. వెయ్యి నగదు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారన్నారు. రూ. 30 వేలకు పథకం ప్రకారం గిడ్డయ్య, రంగడు తల్లీకూతుళ్లను హత్య చేసినట్లు విచారణలో తేలిందని ఎస్పీ వివరించారు. సమావేశంలో కర్నూలు, నంద్యాల డీఎస్పీలు రమణమూర్తి, బాబాఫకృద్దీన్, సిఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.