ప్రత్యేక హోదాపై రాజ్యసభలో నేడు చర్చ
Published Friday, 29 July 2016ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చర్చ జరుగనుంది. చర్చలో ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రత్యేక హోదాపై స్ఫష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక హోదాపై నిన్న చర్చ అసంపూర్ణంగా ముగియడంతో ఈరోజు కూడా కొనసాగించాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు హోదాపై చర్చ జరిపి, అరుణ్జైట్లీ సమాధానం ఉంటుందని భావించారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఆ సమయానికి రాలేనని జైట్లీ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర వైఖరిపై ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఇచ్చే సమాధానంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.