పోలీసుల అదుపులో జానా, షబ్బీర్
Published Friday, 29 July 2016మెదక్: లాఠీచార్జిలో గాయపడిన మల్లన్నసాగర్ రైతులను పరామర్శించేందుకు శుక్రవారం హైదరాబాద్ నుంచి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీని పోలీసులు ఒంటిమామిడి వద్ద అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని మేడ్చల్ పోలీసు స్టేషన్కు తరలించారు. రైతులను పరామర్శించేందుకు వెళుతున్న తమను పోలీసులు అడ్డుకోవడం దారుణమని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.