ఇంజనీర్లపై దాడిని సహించం: హరీష్
Published Friday, 29 July 2016హైదరాబాద్: ప్రజల కోసం పనిచేసే ఇంజనీర్లకు తాము అండగా ఉంటామని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్రావు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో ఇటీవల ముగ్గురు ఇంజనీర్లపై దాడి జరగడం సహించరాని విషయమన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.