ఎంసెట్-2ను రద్దు చేయవద్దని ఆందోళన
Published Friday, 29 July 2016హైదరాబాద్: పేపర్ లీక్ అయిందన్న సాకుతో ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయవద్దని కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు శుక్రవారం తెలంగాణ సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వీరిని వెంటనే అక్కడి నుంచి పంపివేశారు. అనంతరం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసేందుకు విద్యార్థులు బయలుదేరగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిమంది విద్యార్థులు అక్రమాలకు పాల్పడ్డారని మొత్తం పరీక్షను రద్దు చేయవద్దని విద్యార్థులు నినాదాలు చేశారు.