మంత్రుల ఇళ్లపైకి దండెత్తిన విద్యార్థులు
Published Friday, 29 July 2016హైదరాబాద్: ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయవద్దని కోరుతూ ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులు బంజారాహిల్స్లోని మంత్రుల నివాసాలను శుక్రవారం ముట్టడించారు. పేపర్ లీక్కు సంబంధించి మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను వెంటనే బర్త్ఫ్ చేయాలని, లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యార్థులకు ఉపశమనం కలిగేలా వెంటనే అడ్మిషన్లు ఇచ్చేందుకు కౌనె్సలింగ్ ప్రారంభించాలని వారు కోరారు. మంత్రుల ఇళ్ల వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యాన్లో తరలించారు.