సుంకొల్లులో మొక్కలు నాటిన ముఖ్యమంత్రి చంద్రబాబు
Published Friday, 29 July 2016విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం నూజివీడు మండలం సుంకొల్లులో వనం-మనం కార్యక్రమంలో పాల్గొని ఔషధ, రావి, వేప మొక్కలు నాటారు. రాష్ట్రంలో శుక్రవారం ఒక్క రోజే కోటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి నిర్దేశించడంతో అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు.