మెదక్ జిల్లా నిషేధిత ప్రాంతమా..? : భట్టి
Published Friday, 29 July 2016హైదరాబాద్ : మెదక్ జిల్లా సరిహద్దుకు ప్రతిపక్ష నేతలు వెళ్తే అరెస్ట్ చేస్తున్నారు... మెదక్ జిల్లా ఏమైనా నిషేధిత ప్రాంతమా? అని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాలకు ప్రతిపక్ష నేతలు వెళ్తే వాస్తవాలు బయటపడతాయని టీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోందని, జానారెడ్డి, షబ్బీర్ అలీని అరెస్ట్ చేసి తిప్పడం దౌర్జన్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు.