విద్యుత్ కంచె తగిలి ముగ్గురి మృతి
Published Friday, 29 July 2016మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా తొగాపూర్ పంచాయతీ పందిరి హన్మన్పల్లిలో శుక్రవారం విద్యుత్ కంచె తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించిన సంఘటన జరిగింది. తుడుము వెంకటయ్య తన జొన్న పంట అడవి పందుల బారిన పడకుండా వేసిన విద్యుత్ కంచె తగిలి తాను పెంచుకుంటున్న కుక్క మరణించింది. కుక్కని చూసేందుకు వెళ్లిన వెంకటయ్య అనుకోకుండా తీగను పట్టుకొని విద్యుదాఘాతానికి గురై మరణించాడు. కొడుకు కిష్టయ్య ఇనుపతీగకు తగలటంతో మరణించాడు. కొడుకును కాపాడే ప్రయత్నంలో తల్లి విద్యుదాఘాతానికి గురై మరణించింది.