విమానం అదృశ్యం వెనుక కుట్ర లేదనుకుంటున్నా: రక్షణ మంత్రి
Published Friday, 29 July 2016న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన ఏఎన్-32 విమానం అదృశ్యంపై కుట్ర జరగలేదనుకుంటున్నానని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటన చేశారు. వరుసగా ఎనిమిదో రోజు కూడా గాలింపు కొనసాగుతోందని చెప్పారు. ఈ నెల 22న తమిళనాడు చెన్నై నుంచి పోర్ట్బ్లెయిర్ వెళ్తూ ఉదయం ఎనిమిదిన్నర సమయంలో అదృశ్యమైంది. విమానంలో ఆరుగురు సిబ్బందితో పాటు 23 మంది ఉన్నారు. వీరిలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ సిబ్బంది కూడా ఉన్నారు. విమాన శకలాల కోసం 13 నేవీ, 4 కోస్ట్గార్డ్ నౌకలు, ఒక సబ్మెరైన్తో పాటు హెలికాఫ్టర్ల ద్వారా కూడా వెతుకుతున్నారు.