ఎంసెట్-2 లీకేజీ కేసులో ప్రకాశం జిల్లా వాసి అరెస్టు
Published Friday, 29 July 2016హైదరాబాద్ : టీ. ఎంసెట్-2 లీకేజీ కేసులో ప్రకాశం జిల్లా వాసి షేక్ రమేశ్ అలియాస్ రహీమ్ను అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు సీఐడీ అధికారులు ముగ్గురిని అరెస్టు చేశారు.14 మంది విద్యార్థులకు రమేశ్ ప్రశ్నాపత్రం లీక్ చేసి, వారి నుంచి రూ.1.73 కోట్లు వసూలు చేశాడు. విద్యార్థులను పుణె తీసుకెళ్లి శిబిరం నిర్వహించాడు. వసూలు చేసిన సొమ్ములో రూ.1.2 కోట్లు దళారీకి ఇచ్చాడు. రమేశ్ నుంచి రూ.37.5 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు. రూ.15 లక్షలు రమేశ్ తన స్నేహితుడి ఖాతాలో జమ చేశాడని చెప్పారు. ప్రధాన దళారీ రాజగోపాల్రెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.