కెసిఆర్ క్యాబినెట్లో ద్రోహులున్నారేమో గానీ..!
Published Friday, 29 July 2016హైదరాబాద్: సిఎం కెసిఆర్ మంత్రివర్గంలో ద్రోహులున్నారేమో గానీ, తెలంగాణ జెఎసిలో అలాంటివారు లేరని జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం శుక్రవారం అన్నారు. నగరంలో జరిగిన జెఎసి కీలక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు వచ్చే వరకూ ఆగి ఉంటే వైస్ చాన్సలర్ల నియామకంలో ప్రభుత్వానికి మచ్చ పడి ఉండేదికాదన్నారు. ఎంసెట్-2 పేపర్ లీకేజీ, వీసీల నియామకంలో ప్రభుత్వానికి జరిగిన అవమానం, అప్రతిష్ట సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరగరాదని తాము కోరుకుంటున్నామన్నారు.