ఎల్ 7 ట్రైలర్ విడుదల
Published Friday, 29 July 2016రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై అరుణ్ అదిత్, పూజా జవేరి జంటగా ముకుంద్ పాండే దర్శకత్వంలో బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఎల్ 7’. దీనికి సంబంధించిన ట్రైలర్ను హైదరాబాద్లో శుక్రవారం ఉదయం విడుదల చేశారు. సినిమా లోగోను దర్శకుడు విజయ్కుమార్ కొండా ఆవిష్కరించగా, థియేటర్ ట్రైలర్ను గొట్టిముక్కల పద్మారావు, డి.ఎస్.రావు సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, తెలుగులో రెండవ చిత్రాన్ని తమ సంస్థ ద్వారా రూపొందిస్తున్నామని, కథ నచ్చడంతో మూడు నెలలపాటు స్క్రిప్ట్ సిద్ధం చేసి తెరకెక్కించామని అన్నారు. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్గా రూపొందించిన ఈ చిత్రంలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని తెలిపారు. అరుణ్ ఓ ప్రామిసింగ్ కథానాయుకుడిగా ఓ చిత్రంలో కనిపిస్తాడని, ఈ చిత్రం తమకు సంస్థకు మంచి పేరును తెస్తుందని దర్శకుడు ముకుంద్ పాండ్ తెలిపారు. కార్యక్రమంలో గొట్టిముక్కల పద్మారావు, విజయ్కుమార్ కొండా, డి.ఎస్.రావు చిత్ర విశేషాలను తెలిపారు.