అమ్మవారి సన్నిధిలో ఎస్బిహెచ్ ఎండి పూజలు
Published Saturday, 30 July 2016బాసర, జూలై 29: బాసర అమ్మవారి సన్నిధిలో శుక్రవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎండి శాంతన్ ముఖర్జి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న వీరిని ఆలయ అధికారులు, బ్యాంకు సిబ్బంది సాదర స్వాగతం పలికారు. అమ్మవారిచెంత ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహింపచేశారు. ఆలయ ప్రధానార్చకుడు అమ్మవారి చిత్రపటానిచ్చి, ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బాసర బ్యాంక్ మేనేజర్ ప్రవీన్కుమార్, భూపతి, సిబ్బంది పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటికి 15 లక్షల చెక్కు అందజేత...
బాసర ట్రిపుల్ ఐటి యూనివర్సిటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తరపున 15 లక్షల చెక్కును కళాశాల వైస్ ఛాన్స్లర్ సత్యనారాయణకు అందజేశారు. వీటితో గర్ల్స్ హాస్టల్పై సోలార్ ప్లాంట్ను ఏర్పాటుచేయాలని సూచించారు.