S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

కంఠేశ్వర్, జూలై 29: ఎంసెట్-2ను నియంత్రించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ శుక్రవారం బిజెవైఎం ఆధ్వర్యంలో నగరంలోని బస్టాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు న్యాలం రాజు మాట్లాడుతూ, ధనవంతులు ప్రభుత్వంతో కుమ్మక్కై ఎంసెట్-2 పేపర్ లీకేజీకి పాల్పడ్డారని ఆరోపించారు. లీకేజీ వ్యవహారం బయటకు రాగానే ఆయా కార్పొరేట్ విద్యా సంస్థలతో పాటు మంత్రులు ఉలిక్కిపడ్డారని, దీనికి ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేవారు. అంతేకాకుండా లీకేజీ వ్యవహారం బయటకు పొక్కిన వెంటనే ఎంసెట్-2ను రద్దు చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయని, దీంతో కష్టపడి చదివిన విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఎంసెట్-2 లీకేజీ పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటునే, కష్టపడి చదివిన విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం నాయకులు పటేల్ ప్రసాద్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.