S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలి

హైదరాబాద్, జూలై 29: భారతీయ జనతా మహిళా మోర్చా రంగారెడ్డి జిల్లా సమావేశం శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగింది. జిల్లా అధ్యక్షురాలు రజనీరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఉపాధ్యక్షురాలు జి.విజయలక్ష్మి. సెన్సార్ బోర్డు సభ్యురాలు శైలజ, నాయకురాళ్లు అంజలి, లలిత, సుజాత, మీనాక్షి, ఇందిర, ప్రమీల, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి మోహన్‌రెడ్డి, దళితమోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.ప్రతాప్, ప్రధాన కార్యదర్శిలు లచ్చిరెడ్డి, భాష పాల్గొని ఆగస్టు నెలలో తెలంగాణకు మొదటిసారిగా వచ్చే ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలకాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలో జరిగే అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొని, సాయంత్రం ఎల్‌బి స్టేడియంలో జరిగే బహిరంగ సభ (మహా సమ్మేళనం)కు వస్తున్న సందర్భంగా జిల్లా నుంచి వేలాది మంది మహిళలను తరలించి విజయవంతం చేయాలన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బిజెపిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా సైనికుడిలా పని చేయాలని తెలిపారు. జిల్లా అధ్యక్షురాలు రజనీరెడ్డి, కార్యదర్శి దేవర సుజాత ఆధ్వర్యంలో ఘట్‌కేసర్ మండలం నుంచి 50 మంది మహిళలు బిజెపిలో చేరారు.