చెట్లు లేకుంటే బతుకు లేదు
Published Saturday, 30 July 2016హైదరాబాద్, జూలై 29: చెట్లు లేకపోతే బతుకు లేదని, చెట్లవల్లనే అక్సిజన్ లభిస్తుందని భూగర్భజలాలు పెరుగుతాయని అందువల్ల చెట్లు పెంచడం అత్యంత ఆవశ్యకమని హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ భారతి హోళీకేరి తెలిపారు. నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎజెసి స్థానిక కార్పొరేటర్ మమతగుప్తా, ఎజెసి ఆశోక్కుమార్లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ భావితరాలకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం మొక్కలు నాటడమని గుర్తించిన ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.