పిడుగు పాటుకు గృహోపకరణాలు ధ్వంసం
Published Saturday, 30 July 2016పూతలపట్టు, జూలై 29: మండలంలోని గొడుగుచింత ఎస్టీకాలనీలో గురువారం రాత్రి పిడుగుపడి ఇంటిలోని గృహోపకరణాలు ధ్వంసమైనట్లు బాధితురాలు పార్వతమ్మ తెలిపారు. రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందన్నారు. ఉన్నట్టుండి ఇంటి సమీపంలో పిడుగు పడిందన్నారు. దీంతో ఇక్కసారిగా ఇంటికి నిప్పంటుకొని ఇంటిలోని ఫ్యాన్లు, టివి, బీరువా తదితర సామాగ్రి కాలిపోయాయన్నారు. అలాగే పేటపల్లి గ్రామంలోని సుశీల నివాసం ఉంటున్న ఇంటి పక్కన కొబ్బరి చెట్టులో పిడుగు పడడంతో ఇంటిలోని టివి, ఫ్రిజ్, ఫ్యాన్లు, కరెంటు మీటరు ఒక్క సారిగా కాలిపోయింది.