జిల్లా పోలీసు కార్యాలయంలో వనం-మనం
Published Saturday, 30 July 2016గుంటూరు (కొత్తపేట), జూలై 29: జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం వనం-మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. పోలీసు కళ్యాణ మండపంతో పాటు కవాతు మైదానంలో సుమారు 500 మొక్కల పెంపకానికి నాంది పలికారు. రూరల్ ఎస్పీ నారాయణ నాయక్, అదనపు ఎస్పీలు రామాంజనేయులు, వై.టీ నాయుడు, డీఎస్పీలు సత్యనారాయణ, శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.