మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలి
Published Saturday, 30 July 2016ఖమ్మం(జమ్మిబండ), జూలై 29: హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు వాటి పూర్తి పరిరక్షణ బాధ్యతలు తీసుకోవాలని ఏఎస్పీ సాయికృష్ణ అన్నారు. శుక్రవారం కృష్ణప్రసాద్ పోలీస్ వెల్ఫేర్ స్కూల్ మైదానంలో 550మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ షానవాజ్ఖాసీం ఆదేశాల మేరకు జిల్లా అన్ని పోలీస్ స్టేషన్లలో, పోలీస్ కార్యాలయం, పోలీస్ శిక్షణా కేంద్రం, జిల్లా హెడ్క్వార్టర్స్లో ఇప్పటికే పెద్ద ఎత్తున మొక్కలు నాటినట్లు వివరించారు. వాటిని రక్షించే విధంగా వాటర్ ట్యాంక్ వాహనాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొక్కలు ఎదిగేంత వరకు సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి ఆదేశించారు. అనంతరం ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సురేష్కుమార్, ఏఆర్డిఎస్పీలు సంజీవ్, మాణిఖ్యరాజ్, సిఐలు వెంకటనర్సయ్య, రమేష్, మొగిలి, రూరల్ సిఐ ఆంజనేయులు, అర్బన్ సిఐ శ్రీ్ధర్, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.