S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దండకారణ్యంలో ఉద్రిక్తత

భద్రాచలం, జూలై 29: మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు దండకారణ్యంలో ఉద్రిక్తతల నడుమ జరుగుతున్నాయి. మావోయిస్టుల కార్యకలాపాలను భద్రతా బలగాలు అడుగడుగునా అడ్డుకుంటున్నాయి. వారి ఆధిపత్యానికి చెక్ పెడుతున్నాయి. ఇరు వర్గాలు దూసుకువస్తుండటంతో తీవ్ర అలజడి మొదలైంది. ఒడిషాలోని జయ్‌పూర్ నుంచి నక్సల్స్‌కు చేరవేస్తున్న జెలిటిన్‌స్టిక్స్, డిటోనేటర్లు, ఎలక్ట్రికల్ వైర్లు తదితర పేలుడు పదార్ధాలను శుక్రవారం భారీ మొత్తంలో బస్తర్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. చింతూరు-్భద్రాచలం జాతీయ రహదారిపై పేగ వద్ద మావోయిస్టులు సంస్మరణ వారోత్సవాలు విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలను వదిలి వెళ్లారు. పత్రాలను దారిపొడవునా చల్లారు. రాజ్‌నంద్‌గావ్ జిల్లా మాన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔంధీ గ్రామ అటవీప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని 20 కిలోల మందుపాతరను అమర్చారు. దాన్ని సకాలంలో గుర్తించి భద్రతాబలగాలు నిర్వీర్యం చేశాయి. సుక్మా జిల్లా పోలంపల్లి-పాలమడుగు అటవీప్రాంతంలో మావోయిస్టులు నిర్మించిన అమరవీరుల స్మారక స్తూపాన్ని ఎస్టీఎఫ్, డీఆర్‌జీ బలగాలు కూల్చివేశాయి. ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ ఎదుట జిల్లా కమిటీ సభ్యుడు సుఖ్‌దేవ్‌తో సహా 5గురు నక్సల్స్ లొంగిపోయారు. మావోయిస్టుల చర్యలకు భద్రతాబలగాలు ప్రతిచర్యలు వెంటనే చూపుతున్నారు. ఈసారి మావోయిస్టుల ఉత్సవాలను ఎక్కడికక్కడే పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారు. ప్రధానంగా దండకారణ్యం విప్లవకారిడార్‌పై నిఘా వర్గాలు మొత్తం కనే్నశాయి. అక్కడ అణువణువూ వారి కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. దళాల కదలికలను పసిగట్టి భద్రతా బలగాల సాయంతో వారిని నియంత్రిస్తున్నారు. దీంతో ఈసారి సరిహద్దుల్లో మావోయిస్టుల హింస తగ్గింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని నిఘా వర్గాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంతో పాటుగా సంయుక్తంగా దాడులు చేస్తుండటంతో సరిహద్దుల్లో విజయాలు సాధిస్తున్నారు. ఎక్కడికక్కడే ఇన్‌ఫార్మర్ వ్యవస్థను బలోపేతం చేసుకున్న నిఘా వర్గాలు పూర్తి స్థాయిలో మావోయిస్టులపై పైచేయి సాధిస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు ఇదే తరహాలో ఉద్రిక్తత కొనసాగుతోంది.