సిఎం సహాయ నిధి పంపిణీ
Published Saturday, 30 July 2016పాతబస్తీ, జూలై 29: పశ్చిమ నియోజకవర్గంలో ముగ్గురికి ఎమ్మెల్యే జలీల్ఖాన్ చొరవతో ఆర్ధిక సాయం అందింది. శుక్రవారం ఉదయం లబ్దిదారులకు ఎమ్మెల్యే కార్యాలయంలో చెక్కులు అందించారు. నలుగురు రోగులకు 2.5 లక్షల 75వేల చెక్కులు అందించగా బాధిత కుటుంబ సభ్యులు జలీల్ఖాన్కి కృతజ్ఞతలు తెలిపారు. మల్లిఖార్జునపేటకు చెందిన నాలుగేళ్ల చిన్నారి తలసేమియా వ్యాధితో బాధపడుతుండగా వైద్యఖర్చుల కోసం రూ.4.50 లక్షలు సిఎం సహాయ నిధి నుండి మంజూరైనాయి. విద్యాధరపురం తణుకువారివీధికి చెందిన బి.దుర్గ్భావాని కాన్పు అనంతరం ఇన్ఫెక్షన్ వల్ల ఇబ్బందులు పడుతుండగా వైద్య ఖర్చులకు లక్ష రూపాయల సాయం అందించారు. అలీనగర్ మస్తాన్వీధికి చెందిన షేక్ సలీమ్ కుమార్తె షేక్ సఫియా చదువు ఆర్ధిక ఇబ్బందులవల్ల ఆగిపోతుందని తెల్పిన ఎమ్మెల్యే సిఎం సహాయ నిధి నుండి రూ.25వేలు ఇప్పించారు. ఇరవై రోజుల అనంతర సఫియాకి మరో 25వేలు మంజూరు చేయగా దానికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్దిదారులకు అందించారు.