పంజా సెంటర్లో రోడ్డు విస్తరణ
Published Saturday, 30 July 2016పాతబస్తీ, జూలై 29: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ఖాన్ చొరవతో పంజా సెంటర్లోని రైల్వే క్వార్టర్స్ వద్ద రోడ్డు విస్తరణ జరిగింది. పంజా సెంటరు నుండి రైల్వే వెస్టు బుకింగ్ కార్యాలయం వైపు ఉన్న రైల్వే క్వార్టర్స్ గోడ వల్ల విస్తరణకు అంతరాయం కలుగుతుందని ఆ గోడను తొలగించాలని జలీల్ఖాన్ సిఎంకి వివరించగా స్పందించిన ఆయన రైల్వే అధికారులతో సంప్రదించగా రైల్వే అధికారులు గోడ పడేయడానికి అనుమతి ఇచ్చారు. దాంతో గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం మున్సిపల్ సిబ్బంది ఆ గోడను కూల్చారు. అలాగే పెద్ద పెద్ద వృక్షాలను సైతం నామరూపాలు లేకుండా చేశారు. పస్తుతం వున్న రోడ్డు మరో 15 అడుగుల మేర విస్తరణ జరిగింది. పంజా సెంటర్, రైల్వే వెస్ట్ బుకింగ్ సెంటర్లో జెండా చెట్లు తొలగించడం, అనంతరం రైల్వే గోడను కూడా కూల్చడంతో ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి.