ఘనంగా మావోల వారోత్సవాలు
Published Saturday, 30 July 2016సీలేరు, జూలై 29: మావోయిస్టులు పిఎల్జిఎ వారోత్సవాలు కటాఫ్ ఏరియాల్లో స్థూపాలను ఆవిష్కరించి అమరవీరులకు ఘనంగా నివాళ్ళులర్పిస్తున్నారు. వారోత్సవాలను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మావోయిస్టులు ఎఒబి సరిహద్దుల్లో పప్పులూరు, కుర్మనూరు అటవీ ప్రాంతాలోని కటాఫ్ ఏరియాల్లో శుక్రవారం పలు స్థూపాల వద్ద ఎర్ర జెండాలను ఎగురవేసి అమరులైన మావోయిస్టు నేతలకు ఘనంగా విప్లవ జోహార్లులర్పించారు. ఈ కార్యక్రమానికి ఆయా ప్రాంత గ్రామ గిరిజనులు అనేక మంది హాజరై విజయవంతంగా ఈకార్యక్రమాన్ని చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పోలీసులు పప్పులూరు, కుర్మనూరు, కలిమెల, మోటు తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి మావోల వారోత్సవాలను భగ్నం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ కూబింగ్ను ముమ్మ రం చేస్తున్నప్పటికీ వారి అంచనాలను తారుమారు చేస్తూ మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తుండడం పోలీసులకు సవాల్గా మారుతుంది.