ఎంసెట్-2 లీకేజీలో మరో బ్రోకర్ అరెస్టు
Published Saturday, 30 July 2016హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పలువురు విద్యార్థులకు పేపర్ విక్రయించిన రామకృష్ణ అనే బ్రోకర్ను తెలంగాణ సిఐడి పోలీసులు పంజాబ్లో అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. మరికొంత మంది కీలక నిందితుల కోసం ముంబయి, భువనేశ్వర్ నగరాల్లో సిఐడి బృందాలు గాలిస్తున్నాయి.