చర్చి ఫాదర్ను హతమార్చిన మావోయిస్టులు
Published Saturday, 30 July 2016కాకినాడ: తమ గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నాడన్న ఆగ్రహంతో ఓ చర్చి ఫాదర్ను గొంతు కోసి మావోయిస్టులు హతమార్చిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. చింతూరు మండలం లచ్చిగూడెం గ్రామంలోకి అర్ధరాత్రి సమయంలో సుమారు 200 మంది మావోయిస్టులు ప్రవేశించారు. చర్చి ఫాదర్ మారయ్యను వారు కొంత దూరం తీసుకుపోయి గొంతు కోసి చంపేశారు. పోలీసు ఇన్ఫార్మర్లుగా వ్యవహరించే వారందరికీ ఇదే గతి పడుతుందని మావోలు సంఘటన స్థలంలో లేఖను వదిలివెళ్లారు. ఖమ్మం జిల్లాకు చెందిన మావోయిస్టు దళమే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.