ఆప్ ఎమ్మెల్యే నరేశ్యాదవ్కు బెయిల్
Published Saturday, 30 July 2016పంజాబ్ : పంజాబ్లోని మలెర్కోట్లలో ఇటీవల మతగ్రంథాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్కు బెయిల్ మంజూరైంది. సంగ్రూర్లోని అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు యాదవ్కు బెయిల్ మంజూరు చేసినట్లు ఆమ్ఆద్మీ పార్టీ న్యాయ విభాగ అధ్యక్షుడు హిమ్మత్ సింగ్ షెర్గిల్ తెలిపారు. ఈ నెల 24న పంజాబ్ పోలీసులు యాదవ్ను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ పార్టీని దెబ్బతీసేందుకు ఇలా చేస్తున్నారని నరేశ్ యాదవ్ ఆరోపించారు.