జైల్లో ఘర్షణ.. ముగ్గురు ఖైదీల మృతి
Published Saturday, 30 July 2016ఇంఫాల్: మణిపూర్ సెంట్రల్ జైల్లోశనివారం ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు ఖైదీలు మృతి చెందారు. ఈ ఘటనలో ముగ్గురు జైలు అధికారులతో పాటు మరో ఖైదీ గాయపడ్డట్లు పోలీసులు చెప్పారు.ఇంఫాల్లో గల సెంట్రల్ జైల్లో యూసుఫ్(21), అబ్దస్(22) అనే ఇద్దరు ఖైదీలు అదే జైల్లో ఖైదీగా ఉంటున్న చురాచంద్పూర్ జిల్లాకు చెందిన తంగిమిన్లీన్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. తంగిమిన్లిన్ చనిపోయాడన్న వార్త వ్యాపించగానే జైల్లోని సెల్నం-1 లోకి మరి కొందరు ఖైదీలు దూసుకెల్లి హత్యకు పాల్పడిన వారిపై మూకుమ్మడి దాడి చేయడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.