S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రేపు కాంగ్రెస్ మల్లన్న యాత్ర

హైదరాబాద్, జులై 30: మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ముంపు గ్రామాలను సందర్శించేందుకు కోర్టు అనుమతించడంతో సోమవారం యాత్ర నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది. మల్లన్న సాగర్‌ను సందర్శించేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడిలను కోర్టు అనుమతించడం తెలిసిందే. ఈమేరకు శనివారం టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి వారితో చర్చించారు. ఎర్రవెల్లి, సింగారం, వేములగట్టు గ్రామాలను సందర్శించాలని నిర్ణయించారు. గ్రామాలను సందర్శించాలని అనుకున్నప్పుడు మెదక్ జిల్లా ఎస్పీకి 24 గంటల ముందు సమాచారం ఇవ్వాలని కోర్టు నిబంధన విధించింది. ఈ మేరకు వారు జిల్లా ఎస్పీకి శనివారం లేఖ రాశారు. ఆదివారం సాయంత్రానికి జిల్లా ఎస్‌పి నుంచి అనుమతి లభించే అవకాశం ఉన్నందున, సోమవారం ఉదయం వెళ్ళడం మంచిదని భావించారు. అయితే దామోదర రాజనర్సింహ, సునీతా లక్ష్మారెడ్డి నలుగురు చొప్పున అనుచరులను తీసుకెళ్ళేందుకు కోర్టు అనుమతి ఇచ్చినందున ఎవరిని వెంట తీసుకెళ్ళాలన్నది ఖరారు కాలేదు. ఎవరిని తీసుకెళ్ళాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారు ఉత్తమ్‌కుమార్ రెడ్డికే బాధ్యత అప్పగించారు.