వరద భారతం
Published Sunday, 31 July 2016అస్సాం: ఉత్తర, ఈశాన్య భారత రాష్ట్రాలు వరదలతో విలవిల్లాడుతున్నాయి. బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపానికి ఈశాన్యరాష్ట్రం అస్సాం పూర్తిగా మునిగిపోయింది. ఇప్పటి వరకు దాదాపు 34మంది మరణించారు. అటు పశ్చిమబెంగాల్లో 31గ్రామాలు
జలసమాధి అయిపోయాయి. బీహార్లోనూ అదే పరిస్థితి. వరదల ఉద్ధృతికి దాదాపు 25లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దేశరాజధాని ఢిల్లీని సైతం వర్షాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. జనం గుర్రపుబగ్గీలు, ఏనుగులపై ప్రయాణాలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అటు ముంబయని కూడా వర్షాలు వీడటం లేదు. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నదులు, వాగులు, వంకలు అన్నీ పొంగి పొర్లుతున్నాయి.