అర్జెంటీనా సాకర్ ఆటగాళ్ల హోటల్ గదుల్లో చోరీ
Published Sunday, 31 July 2016ప్యూబ్లా, జూలై 30: ఒలింపిక్స్లో పాల్గొంటున్న అర్జెంటీనా సాకర్ ఆటగాళ్లు బస చేసిన హోటల్ గదుల్లో చోరీ జరిగింది. ఒలింపిక్స్కు సిద్ధమయ్యేందుకు వీలుగా పలు మ్యాచ్లు ఆడిన అర్జెంటీనా జట్టు చివరి ఫ్రెండ్లీ మ్యాచ్లో మెక్సికోను ఢీ కొంది. ఇరు జట్లు ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా, మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఆటగాళ్ల గదుల్లో చోరీ జరిగిందని అర్జెంటీనా ఫుట్బాల్ సంఘం (ఎఎఫ్ఎ) ఉపాధ్యక్షుడు క్లాడియో తపియా తెలిపాడు. నగదు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు పోయాయని గుర్తించిన వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని చెప్పాడు.