టైటాన్స్కు కఠిన పరీక్ష
Published Sunday, 31 July 2016హైదరాబాద్, జూలై 31: ప్రో కబడ్డీ చాంపియన్షిప్లో ఆదివారం పుణెరీ పల్టన్తో జరిగే మ్యాచ్లో తెలుగు టైటాన్స్ కఠిన పరీక్ష ఎదుర్కోక తప్పదు. హోం టౌన్లో, వేలాది మంది అభిమానుల సమక్షంలో మ్యాచ్ జరుగుతున్న కారణంగా టైటాన్స్ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో అనూహ్యంగా పది పాయింట్ల తేడాతో ఓడిన టైటాన్స్ కనీసం మూడో స్థానానికి జరిగే మ్యాచ్లోనైనా గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ అంచనాలే జట్టుపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ మ్యాచ్లో టైటాన్స్ ఏ విధంగా రాణిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇలావుంటే, మూడో స్థానానికి మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగే ఫైనల్లో జైపూర్ పింక్ పాంథర్స్, పాట్నా పైరేట్స్ జట్లు టైటిల్ కోసం పోరాడతాయి. పాట్నా హాట్ ఫేవరిట్గా బరిలోకి దిగుతున్నా, జైపూర్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.