చొరబాటు యత్నం భగ్నం
Published Sunday, 31 July 2016శ్రీనగర్, జూలై 30: జమ్మూ-కాశ్మీరులోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద శనివారం ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు చేసిన ప్రయత్నాన్ని సైనిక దళం భగ్నం చేసింది. ఇందుకు సంబంధించిన ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా, ఇద్దరు సైనికులు మృతిచెందారు. నౌగామ్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి శనివారం తెల్లవారు జామున ఉగ్రవాదుల కదలికలను గమనించిన సైనిక దళం వారిని ప్రతిఘటించిందని, ఇరుపక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు, ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, మరో జవాను గాయపడ్డాడని సైనికదళ అధికారి వెల్లడించారు. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, ఘటనా స్థలం నుంచి రెండు ఎకె రైఫిళ్లు, ఒక యుబిజిఎల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.