తల్లికి కుమార్తె అంత్యక్రియలు
Published Sunday, 31 July 2016రాపూరు, జూలై 30: అన్నీ తానై ఓ కన్నతల్లికి కొడుకు లేని లోటు తీర్చే విధంగా తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన సంఘటన నెల్లూరు జిల్లా రాపూరు మండలం పులిగెలపాడు గ్రామంలో శనివారం జరిగింది. రాపూరు ఆర్టిసి డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న అంకమ్మ (36) తీవ్ర అస్వస్థతకు గురై శుక్రవారం మృతిచెందింది. అయితే ఈమెకు కొడుకులు లేరు. ఒక కుమార్తె మాత్రమే ఉంది. మృతిరాలి కుమార్తె రమ్యశ్రీ గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ చదువుతోంది. కాగా, మృతురాలి అంత్యక్రియలు నిర్వహించడానికి కొడుకులు లేనందున కుమార్తె అంత్యక్రియలు నిర్వహించి కన్న కూతురే అమ్మా నేనున్నానంటూ అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించింది. కాగా, శనివారం ఈ మృతదేహాన్ని రాపూరు ఆర్టిసి డిపో కార్మిక సంఘ నాయకులు, స్థానిక ప్రజలు సందర్శించి నివాళులర్పించారు. ఆర్టిసి డిపో మేనేజర్ సయ్యద్ అహ్మద్ సందర్శించి 15 వేల రూపాయల అందజేశారు.
చిత్రం..కన్నతల్లికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న రమ్యశ్రీ