S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అసలు వారిని వదిలేసి బ్రోకర్లపై కేసులు పెడుతున్నారు

హైదరాబాద్, జూలై 30: ఎంసెట్-2 లీకేజీకి అసలు కారకులైన వారిని వదిలేసి మధ్యలో వచ్చిన బ్రోకర్లపై ప్రభుత్వం కేసులు పెట్టిస్తున్నదని బిజెపి నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. ఎంసెట్-2 లీకేజిపై సిఐడి ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతృప్తిగా ఉన్నారా? అని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. లోగడ రైలు ప్రమాదం జరిగితే లాల్ బహదూర్ శాస్ర్తీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఇంత పెద్ద కుంభకోణం జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రులు ఎందుకు రాజీనామా చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంత్రివర్గంలో కొనసాగరాదని అన్నారు. పరీక్షా పత్రం ప్రింటింగ్ సమయంలో కన్వీనర్ దగ్గరే ఉండాలని ఆయన తెలిపారు. కన్వీనర్ లేకపోతే ప్రత్యేక అధికారి అయినా ఉండాలని అన్నారు.