S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తాడో పేడో తేల్చుకుంటాం..

కర్నూలు, జూలై 30:రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపితో చేతులు కలిపామని ఆ ప్రయోజనాలు నెరవేరవని స్పష్టమవుతున్న సమయం రావడంతో ఇక తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని రాజ్యసభ సభ్యు డు టిజి వెంకటేష్ వెల్లడించారు. నగరంలోని తన కార్యాలయంలో శనివా రం టిజి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. విభజన సమయంలో కాంగ్రెస్‌పై వత్తిడి తీసుకువచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో రాజ్యసభలో ప్రకటన చేయించిన వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు అభినందనీయులన్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే తాము ప్రత్యేక హోదా పదేళ్లు కల్పిస్తామని ప్రధాని నరేంద్రమోదీ సహా బిజెపి నేతలంతా చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు కావడానికి కూడా అదే కారణమని టిజి తెలిపారు. అయితే రెండేళ్ల కాలంగా హోదా విషయం నాన్చుతూ చివరకు చేతులెత్తేస్తే సహించే ప్రశే్న లేదన్నారు. ఏడాది క్రితమే సిఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావాలని భావించగా పార్టీ సీనియర్ నాయకుల సలహా మేరకు ఆగారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని రావాల్సిన సహాయం అందకుండా పోతుందన్న ఆందోళన నేపథ్యంలో రెండేళ్లు ఓపిక పట్టామని ఇక ఓపిక నశించి కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విజయవాడలో ఆదివారం పార్లమెంటు సభ్యుల సమావేశంలో ఇదే విషయంపై కీలక సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు ఆదేశాల మేరకు తాము ముందుకెళ్తామన్నారు. నాడు బిజెపితో రాష్ట్ర ప్రయోజనాల కోసం చేతులు కలిపిన తాము నేడు అదే ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకు మద్దతు పలికామన్నారు. అయితే కాంగ్రెస్ బిల్లు విషయంలో తూతూ మంత్రంలా వ్యవహరిస్తుంటే రాజ్యసభలోని ఇతర పార్టీల మద్దతు కూడగట్టి శుక్రవారం సమావేశంలో మాట్లాడేలా చేశామని తెలిపారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ప్రతిపాదించే ప్రతి బిల్లును రాజ్యసభలో వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని కేంద్రం నష్టపరుస్తుంటే బంద్‌లకు పిలుపునిస్తూ వైకాపా అధినేత జగన్ కూడా రాష్ట్ర ప్రజలకు నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ఎస్వీ మోహనరెడ్డి, మణిగాంధీ, టిడిపి నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

శ్రీశైలం నీళ్లు
కోస్తాకు తరలిస్తే సహించం
* నీటి తరలింపుపై విద్యార్థి, యువజన సంఘాల నిరసన
* జలమండలి కార్యాలయం దిగ్బంధం
కర్నూలు సిటీ, జూలై 30 : శ్రీశైలం జలాశయంలోని నీళ్లు రాయలసీమకే వినియోగించాలని, సీమకు అన్యాయం చేసి కోస్తాకు తరలించాలని చూస్తే సహించేది లేదని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు శనివారం నగరంలోని ఐదు రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించి, అనంతరం జలమండలి కార్యాలయా న్ని దిగ్బంధించారు. కార్యక్రమంలో రాయలసీమ యువజన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వివి. నాయుడు, రాయలసీమ అధ్యక్షుడు రవికుమార్ పాల్గొని మాట్లాడారు. నాగార్జునసాగర్‌లో 120 టిఎంసిల నీరు నిల్వ ఉన్నప్పటికీ శ్రీశైలం జలాశయం నుంచి 10 టిఎంసిల నీటిని అక్రమంగా తరలించాలని జీఓ జారీ చేయటం ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 30.8 టిఎంసిల నీరు మాత్రమే ఉందని గుర్తు చేశారు. అయితే పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు ఇస్తామని మాయమాటలు చెప్పిన సిఎం చంద్రబాబు కోస్తాంధ్ర ప్రయోజనాల కోసం శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని తరలించాలని ప్రయత్నం చేయటం దారుణమన్నారు. శ్రీశైలం నుంచి అన్యాయంగా నీటిని కోస్తాకు తరలించే మోసపూరిత ఆలోచనను మానుకుని రాయలసీమకు న్యాయబద్దంగా చెందే నీటిని సీమ అవసరాలకే వినియోగించాలని, లేనిపక్షంలో సీమలో టిడిపికి పుట్టగతులుండవని హెచ్చరించారు. చంద్రబాబు సీమవాసి అయినా తన స్వార్థ ప్రయోజనాల కోసం కోస్తా వైపు మొగ్గు చూపుతూ సీమకు తీరని అన్యాయం చేయాలని చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం జలాశయంలోని నీటిని అక్రమంగా తరలించేందుకు జారీ చేసిన జీఓను వెంటనే రద్దు చేయాలని లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాయలసీమ నిర్మాణ సమితి నాయకుడు జనార్ధన్, యువజన విద్యార్థి సంఘాల నాయకులు సురేంద్రరెడ్డి, రామచంద్ర సాగర్, విశ్రాంత ఇంజినీర్ కృష్ణారెడ్డి, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, సాయికృష్ణ, నాగేశ్వరెడ్డి, రామరాజ్, క్రాంతికుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంగమేశ్వరం-శ్రీశైలం బోటు యాత్ర
* శ్రావణ మాసంలో ప్రారంభించే అవకాశం
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జూలై 30 : శ్రీశైలం జలాశయ నీటి మట్టం క్రమేణా పెరుగుతుండటంతో సంగమేశ్వరం నుంచి శ్రీశైలం వరకూ బోటు యాత్రను ప్రారంభించడానికి పర్యాటకశాఖ సిద్ధపడుతోంది. మొదటి బోటును సంగమేశ్వరుడి సన్నిధి నుంచి శ్రీశైలం వరకూ ఈ నెల 4,5 తేదీల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. సంగమేశ్వరం నుంచి శ్రీశైలం వరకూ బోటు యాత్ర ఏర్పాటు చేయాలన్న కలెక్టర్ విజయమోహన్ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ రెండు బోట్లు కొనుగోలు చేసింది. వీటిలో మొదట ఒక బోటును ప్రతి రోజూ ఒక ట్రిప్పు నిర్వహించాలని పర్యాటక శాఖ భావిస్తోంది. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండవ బోటును నడిపేందుకు ప్రయత్నిస్తారు. ఒక్కో బోటులో 50 మంది ప్రయాణించే వీలుంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 820 అడుగులకు పైగా చేరుకుంటే సంగమేశ్వరం వద్ద బోటు ఎక్కేందుకు వీలుంటుందని పేర్కొంటున్నారు. సప్తనదుల సంగమ స్థలిలో నిర్మించిన స్నానపు ఘాట్ వద్దకు నీరు చేరిన తరువాత తేదీ ఖరారు చేస్తామంటున్నారు. శ్రీశైలం జలాశయంలో శనివారం సాయంత్రం సమయానికి నీటి మట్టం 816 అడుగులకు చేరింది. మరో రెండు రోజుల్లో 820 అడుగులకు పైగా నీరు చేరుతుంది. దాంతో సంగమేశ్వర పురాతన ఆలయం వద్ద బోటు ఎక్కడానికి అనువుగా ఉంటుందని సాగునీటి అధికారులు భావిస్తున్నారు. సంగమేశ్వరం వద్ద నీటి మట్టం పరిశీలించి మొదట ట్రయల్ రన్ నిర్వహిస్తామని నిపుణులు అనుమతిచ్చిన వెంటనే కలెక్టర్ విజయమోహన్‌కు నివేదిక సమర్పించి యాత్రను ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తామని వెల్లడిస్తున్నారు. పుష్కరాల సమయంలో సంగమేశ్వరం, శ్రీశైలం మధ్య రోజుకు 3,4 ట్రిప్పులు నడిపే అవకాశాలున్నాయి. సంగమేశ్వరం నుంచి శ్రీశైలం వరకూ 2 గంటల ప్రయాణం, శ్రీశైలం నుంచి సంగమేశ్వరం వరకూ 3 గంటల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. యాత్ర మధ్యలో అక్క మహాదేవి గుహల సందర్శన కూడా ఉంటుందంటున్నారు. పర్యటన తేదీ ఖరారు చేశాక యాత్రికుల నుంచి వసూలు చేసే చార్జి నిర్ణయిస్తామన్నారు. సంగమేశ్వరం నుంచి శ్రీశైలం వరకూ కృష్ణా నదిలో ప్రయాణించే అవకాశం రానుండటంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
నంద్యాల-కడప రైలు
ప్రారంభం వాయిదా
నంద్యాల, జూలై 30 : నంద్యాల - యర్రగుంట్ల రైల్వే మార్గంలో ఆగస్టు నెల 2వ తేదీ నుండి నంద్యాల నుంచి కడప వరకూ డెమో రైలు నడుపుతారని రైల్వే ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు నంద్యాల రైల్వే స్టేషన్‌లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆగస్టు 2వ తేదీన నిర్వహించే ప్రారంభోత్సవం రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆ తేదీ నాటికి అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నంద్యాల-కడప మధ్య ప్రతి రోజూ 2 ట్రిప్పులు తిరిగే డెమోరైలు ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మధ్య ట్రయల్ రన్ నడుపుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కొత్తగా కేటాయించిన ఈ ర్యాక్‌ను రైల్వే అధికారులు పరిశీలిస్తున్నారని, రెండు రోజుల్లో డెమో రైలు నంద్యాల చేరుకొనే అవకాశం ఉందన్నారు. నంద్యాలకు వచ్చిన అనంతరం నంద్యాల - యర్రగుంట్ల మద్య ట్రయల్ రన్ నిర్వహించి రైల్వే మంత్రి సురేష్ ప్రభు చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
జగన్‌కు ప్రజల కంటే పదవిపైనే మక్కువ..
* బంద్ ఢిల్లీలో చేయాలి : ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జూలై 30:వైకాపా అధినేత జగన్‌కు రాష్ట్ర ప్రజల కంటే ముఖ్యమంత్రి పదవిపైనే మక్కువ ఎక్కువ అని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి విమర్శించారు. నగరంలోని ఎంపి టిజి వెంకటేష్ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ఎస్వీ విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం సిఎం చంద్రబాబు కృషి చేస్తుంటే ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందిపోయి రాష్ట్రం నష్టపోయేలా బంద్‌కు పిలుపునివ్వడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని మండిపడ్డారు. గతంలో వైకాపా ఆధ్వర్యంలో తాము ఢిల్లీలో ధర్నా చేయగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రధాని నరేంద్రమోదీని కానీ ఒక్క మాట మాట్లాడకుండా సిఎం చంద్రబాబును మాత్రమే విమర్శించారని తెలిపారు. హోదా ఇవ్వాల్సింది చంద్రబాబా, మోదీనా అనే కనీస అవగాహన లేని జగన్ నష్టపోయిన రాష్ట్రాన్ని మరింత నష్టపరిచేందుకు బంద్‌కు పిలుపునిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తే తాము కూడా మద్దతుపలుకుతామని తెలిపారు. తక్షణం ఆయన రాష్ట్ర బంద్ పిలుపును ఉపసంహరించుకుని ఢిల్లీలో ఆందోళనకు సిద్ధపడాలని సూచించారు. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఘనత దేశ చరిత్రలో ఒక్క టిడిపికే దక్కిందన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న సుజనాచౌదరి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించడం, రాజ్యసభ ఉపాధ్యక్షుడు వారించడం దేశ ప్రజలందరూ చూశారని తెలిపారు. అయితే జగన్ మాత్రం ఇవేమీ పట్టనట్లు రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తే నష్టపోయేది ప్రజలన్న విషయం మర్చిపోకూడదని తెలిపారు. బిజెపి తీరుతో ప్రజలు విసిగి పోయారని ఇక ముందు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే ఆ పార్టీకి పడుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము బిజెపితో చెలిమి చేశామని గతంలో చంద్రబాబు పలుమార్లు స్పష్టం చేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీతో పాటు ఆర్థిక, సాంఘిక సహాయం కోసం రెండేళ్ల కాలంగా ఓపిక పట్టిన చంద్రబాబు ఇప్పుడు అదే కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారంటే ఆయనలో ఎంత ఆగ్రహం వ్యక్తమవుతుందో వెల్లడవుతోందన్నారు. టిడిపి క్రమశిక్షణ సంఘం సభ్యుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడుతున్న సిఎం చంద్రబాబును విమర్శించే అర్హత వైకాపా ఎమ్మెల్యే రోజాకు లేదని, రాజకీయాలంటే సినిమా కాదని హితవు పలికారు. ప్రజల కోసం కాకుండా పదవి కోసం పోరాడే జగన్ మెప్పు కోసం ఇష్టానుసారంగా మాట్లాడితే ఉన్న పదవి పోతుందని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యే మణిగాంధీ, బిసి నేత రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
సీమకు అన్యాయం జరిగితే
ఉద్యమాలు ఉద్ధృతం
ఆళ్లగడ్డ, జూలై 30: రాయలసీమకు రావాల్సిన నీటి ఇవ్వాలని, కోస్తాకు, తెలంగాణకు ఇవ్వడం సమంజసం కాదని రాయలసీమ పరిరక్షణ సమితి విద్యార్థి పెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఓబులేసు డిమాండ్ చేశారు. పట్టణంలోని కెవి సుబ్బారెడ్డి కళాశాల విద్యార్థులతో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమకు అన్యాయం జరిగితే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ఎలాంటి నిధులు ఇవ్వకుండా నిధులన్ని కోస్తా ప్రాంతానికే తరలిస్తున్నారన్నారు. సిఎం చంద్రబాబునాయుడు పక్షపాత ధోరణి వీడి రాయలసీమకు రావాల్సిన నీటిని శ్రీశైలం నుంచి పంపాల్సిన అవసర ఎంతైనా వుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్, సాయి, హరి, చెన్నయ్య, భూపాల్, తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంపై వత్తిడి తేవాలి..
ఎపికి హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని ఆళ్లగడ్డ ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు అమీర్‌బాషా అన్నారు. పట్టణంలోని సాయి పాఠశాల విద్యార్థులతో శనివారం నాలుగురోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారంగా ఏర్పడి ప్రత్యేక హోదాకు మద్దతుగా నిదానాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలిపారు.
నాసిరకంగా పుష్కరాల పనులు
* వైకాపా ఎమ్మెల్యేలు బుగ్గన, ఐజయ్య
పాములపాడు, జూలై 30:కృష్ణా పుష్కరాల నేపథ్యంలో సంగమేశ్వరం లో చేపట్టిన పనుల్లో నాణ్యత లేదని, నాసిరకంగా చేపట్టారని వైకాపా ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఐజ య్య ఆరోపించారు. వారు శనివారం కొత్తపల్లె మండల పరిధిలోని సప్తనదుల సంగమేశ్వరం వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ జరుగుతున్న పుష్కర ఘాట్‌లు, వసతుల ఏర్పాట్లను పరిశీంచారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ ప్రభు త్వం టిడిపి నేతల జేబులు నింపడానికి తెలుగు తమ్ముళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టిందన్నారు. దీంతో అధికార పార్టీ నాయకులు ధనార్జనే ధ్యేయంగా నాణ్యతా ప్రమాణాలను తుంగలోతొక్కి పనులు నాసిరకంగా చేపట్టారని ఆరోపించారు. పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా ఏమా త్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇక అక్కడే ఉన్న క్వాలిటీ కంట్రోల్ అధికారితో మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేనిచో కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారితో పాటు వైకాపా జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, అనంతపురం మాజీ ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జి బుడ్డా శేషిరెడ్డి, నాయకులు ఉన్నారు.
శ్రీశైలం నీటి వాడకంలో
సీమకు తొలి ప్రాధాన్యతివ్వాలి
కర్నూలు సిటీ, జూలై 30:శ్రీశైలం జలాశయంలోని నీటి వాటా వాడకంలో రాయలసీమకు తొలి ప్రాధాన్యాత ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి(ఆర్‌ఎస్‌ఎస్) ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్ ముందు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టగా ఆర్‌ఎస్‌ఎస్ కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి, కో కన్వీనర్ పేర్వా రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బివై రామ య్య, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మినరసింహా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా ఆదా అయ్యే కృష్ణా జలాలను సీమకే ఇచ్చి రతనాలసీమగా మారుస్తామని సిఎం చంద్రబాబు పలుమార్లు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అంతేకాకుండా శ్రీశైలం జలాశయంలో 100 టిఎంసిల నీరు నిల్వ ఉంచి సీమను ఆదుకుంటామని గొప్పలు చెప్పారని విమర్శించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌పై ఆధారపడిన ప్రాజెక్టులతో పాటు హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు నీరు ఇచ్చి కరవు పీడిత ప్రాంతాలను కూడా ఆదుకుంటామని పదే పదే వాగ్దానాలు చేశారన్నారు. ప్రస్తుతం వాటిని విస్మరించి ఈనెల 27వ తేదీ శ్రీశైలం జలాశయం నుంచి 10 టిఎంసిల నీటిని నాగార్జునసాగర్‌కు తరలించాలని జీఓ విడుదల చేశారని, వెంటనే ఆ జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 30.8 టిఎంసిల నీరు నిల్వ ఉందని, వాటిలో 10 టిఎంసిల నీటిని విడుదల చేయాలని జీఓ జారీ చేయటం ఏంటని ప్రశ్నించారు. ఈవిధంగా జలాశయంలోకి వచ్చిన చుక్క చుక్క నీటిని కిందికి తరలించుకుపోతే రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగునీటి సమస్యలు తీవ్రమవుతాయన్నారు. శ్రీశైలం జలాశయంలో 854 అడుగులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతానికి చెందిన రైతలు ఎప్పటి నుంచో కోరుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. 875 అడుగులపైన జలాశయంలో నీరు ఉంటే సాగర్‌కు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం జలాశయం నుంచి 10 టిఎంసిల నీటిని సాగర్‌కు తరలించడాన్ని తక్షణమే నిలిపి వేసి, దానికి సంబంధించిన జీఓను రద్దు చేయాలన్నారు. అలాగే జలాశయంలో 854 అడుగుల నీటి మట్టా న్ని అమలు చేసే విధంగా ఉత్తర్వులు విడుదల చేసి, నీటి వాడకంలో సీమకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే దీన్ని చట్టబద్ధ హక్కుగా సీమ రైతాంగానికి ప్రభుత్వమే కల్పించాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృ తం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్, కెసి కెనాల్ పరిరక్షణ కమిటీ నాయకులు పాల్గొన్నారు.
శ్రీశైలం దేవస్థానంలో క్షురకులపై వేటు
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జూలై 30:శ్రీశైలం దేవస్థానంలో పని చేస్తున్న క్షురకులపై ఇఓ నారాయణ భరత్‌గుప్తా వేటు వేశారు. ఇఓ శనివారం తలనీలాలు సమర్పించే కల్యాణకట్టను ఆకస్మికంగా తనిఖీ చేయగా 15 మంది క్షురకులు విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. వారు ఎవరి అనుమతి లేకుండా గైర్హాజరైనట్లు తెలుసుకున్న ఇఓ వారిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. అలాగే కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్నందున భక్తులకు అసౌకర్యం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని దేవాలయ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో వ్యాపారం చేస్తున్న వారితో సమావేశం నిర్వహించి వీధుల్లో దుకాణాలు ఏర్పాటు చేయకుండా జాగ్రత్త పడాలని సూచిస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నుంచి తాను ఆకస్మిక తనిఖీలు చేపడతానని ఎక్కడ పొరపాట్లు జరిగినా క్షమించే ప్రశే్నలేదన్నారు. భక్తుల సౌకర్యం, భద్రతే తమకు ప్రధానమని ఇఓ స్పష్టం చేశారు.
శాకాంబరిగా కామేశ్వరీదేవి
మహానంది, జూలై 30: మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి అమ్మవారిని శాకాంబరి అలంకారంతో భక్తుకలు కనువిందు చేశారు. శనివారం ఆశాడ బహుళ ఏకాదశి రోజున దాదాపు 250 కిలోకు పైగా కూరగాయలతో అమ్మవారితోపాటు ఆలయాన్నంత అలంకరింపచేశారు. దాతలైన భూమా కృష్ణమూర్తి కుమారులు, నర్సరావుపేటకు చెందిన శ్రీకృష్ణ జ్యోతిష్యాలయం అధినేత మస్తాన్‌రావులు అందించిన కూరగాయలతో నేటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి విశేష ద్రవ్య అభిషేకాలు, సహస్త్ర నామార్చనలు, శ్రీ చక్రార్చనలు నిర్వహించి శాకాంబరిగా అలంకరించారు. ఆలయ ఇఓ డాక్టర్ శంకర వర ప్రసాద్, చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఎఇఓ రాజశేఖర్‌లతో పాటు నేటి ఉభయ దాతలతో కుంకుమార్చన పూజలు, కూరగాయలతో అర్చనలు నిర్వహించారు. విశిష్టత గురించి వేదపండితులు రవిశంకర్ అవధాని వివరిస్తూ ఆషాడమాసంలో వచ్చే ఏకాదశి రోజు కాని, పౌర్ణమి రోజు కాని అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి భక్తులు దర్శించుకుంటే వారికి అనారోగ్యాలు తొలగిపోతాయన్నారు. రైతుల పొలాల్లో పంటలు బాగాపండుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు ఈశ్వర్‌రెడ్డి, అర్చకులు రాఘవశర్మ, హరిహర కుమార శర్మ, నాగశేషఫణి, సురేంద్రనాధశర్మ, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, ప్రోటోకాల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నల్లమలలో అలుగు లభ్యం
చాగలమర్రి, జూలై 30: చాగలమర్రిలోని చెంచుగూడెం గ్రామస్థులకు నల్లమల అడవిలో శనివారం అలుగు దొరికింది. దానిని ఎస్‌ఐ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు స్వాధీనం చేసుకకున్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ అలుగు ఒక మీటరు పొడవు వుంది. ఇది అరుదైన జంతువుగా చూసిన ప్రజలు పేర్కొంటున్నారు.