పిల్లలను బలిపశువులను చేస్తున్నారు :మెహబూబా
Published Sunday, 31 July 2016శ్రీనగర్:కాశ్మీర్ ఇప్పటికీ రగులుతూనే ఉంది. పెద్దలు, మహిళలను లక్ష్యంగా చేసుకుని చిన్నారులు దాడులకు పాల్పడుతున్నారు. ముసుగు ధరించిన 15 సంవత్సరాల లోపు చిన్నారులు రాళ్లు, వస్తువులతో దాడికి పాల్పడుతున్నారని, వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ విధ్వంసం సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు. కాశ్మీర్ సమస్యకు ఇదా పరిష్కారమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చర్చలుతప్ప మరే మార్గాన్నీ తాము అంగీకరించమని, చర్చలతోనే సమస్య పరిష్కారమవుతుందని ఆమె అన్నారు.