ఇప్పడే కాదు!
Published Sunday, 31 July 2016శ్రీదేవి తనయ జాహ్నవి మహేష్ బాబు కథానాయకుడిగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కథానాయికగా నటిస్తోందని ఆమధ్య వినిపించిన వార్త. ఇందులో నిజం ఎంత ఉందని ఆరాతీస్తే, తానిప్పుడే సినిమాల్లో నటించడానికి సిద్ధంగా లేనని జాహ్నవి చెప్పేసింది. లాస్ఏంజిల్స్లో ఓ ప్రసిద్ధమైన డాన్స్ స్కూల్లో డాన్స్ నేర్చుకుంటున్నానని, అనేక విషయాలలో తర్ఫీదు తీసుకుంటున్నాను కనుక, సినిమాల్లో నటించే నిర్ణయం ఇంకా తీసుకోలేదని చెబుతోంది. తనపై అనేక అంచనాలు పెట్టుకున్నవారికి అసలు విషయం చెప్పేస్తోంది. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా వుండాలనుకోవడం తన నైజమని, అన్నీ కచ్చితంగా వుంటేనే కెమెరాముందుకు వస్తానంటోంది. మహేష్బాబు తాజా సినిమాలో హీరోయిన్గా రకుల్ప్రీత్ సింగ్ నటిస్తోంది.