ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ఘనత తెలంగాణకే
Published Sunday, 31 July 2016తూప్రాన్, జూలై 31 : తెలంగాణ ప్రజల కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పథకాలు విజయవంతం కావాలని మహంకాళి అమ్మవారు దీవించాలని కోరుతున్నట్లు ఎంపి కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్లో ఆదివారం మహంకాళి జాతర సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చిన గనత దేశంలోనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుకు దక్కుతుందని, ఆయన అమలు చేస్తున్న పథకాలకు ఆకర్శితులైన ప్రధానమంత్రి ఈ నెల 7న గజ్వేల్కు వస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే గజ్వేల్ నియోజకవర్గం అత్యున్నత స్థానంలో ఉండాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు అనంతరెడ్డి, సర్పంచ్ శివమ్మ, నేతలు శ్రీశైలంగౌడ్, అంజాగౌడ్, శేఖర్గైడ్, శ్రీనివాస్, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు.