అన్నం ముద్ద అడ్డుపడి బాలుడి మృతి
Published Monday, 1 August 2016ఖమ్మం రూరల్, జూలై 31: అన్నం ముద్ద గొంతులో అడ్డుపడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలోని కాచిరాజుగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. గ్రామానికి చెందిన వీర్ల సునీత, గోవర్ధన్లకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు దిలీప్ వయసు 12 నెలలు. తల్లి సునీత ఆ కుమారునికి అన్నం తినిపిస్తుండగా ప్రమాదవశాత్తు అన్నం ముద్ద గొంతులో అడ్డుపడి ఊపిరి ఆడక మరణించాడు. ఆకస్మికంగా జరిగిన ఈసంఘటనతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.