వేటగాళ్ల ఉచ్చులో నెమళ్లు
Published Monday, 1 August 2016భైంసా రూరల్, జూలై 31: జాతీయ పక్షి నెమళ్లను యధేచ్చగా వేటాడుతూ వేలల్లో స్మగ్లర్లు సొమ్ముచేసుకుంటున్నప్పటికి అటవీశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. ఆదివారం పట్టణ సమీపంలోని కమలాపూర్ గుట్టపై స్మగ్లర్లు జాతీయ పక్షి నెమళ్లను వేటాడుతుండగా స్తానికులు గమనించారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా వేటగాళ్లు వేటాడిన నెమళి మృతదేహాన్ని వదిలి అటవీలోకి పరారయ్యారు. ప్రతీ ఆదివారం భైంసా సమీపంలోని గుట్టల్లో యధేచ్చగా వన్యప్రాణులను వేటాడుతూ విందులు జరుపుకుంటున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నప్పటికి అటవీశాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.