ఆకట్టుకున్న సైకత జల సంకల్పం
Published Monday, 1 August 2016మొగల్తూరు, జూలై 31: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో ఆదివారం నరసాపురం గురుకుల పాఠశాల విద్యార్థులు వేసిన జల సంకల్పం సైకత శిల్పం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. నరసాపురం రూరల్ మండలం తూర్పుతాళ్ల గ్రామంలోగల ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు 22మంది బీచ్లో సూమారు రెండు గంటలపాటు ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జలవనరులు వినియోగంపై తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల యుద్ధం వలన కలిగే లాభ నష్టాలను అందరూ అర్ధం చేసుకోవాలని ఈ సైకత శిల్పాన్ని చూసిన పలువురు చర్చించుకోవటం కన్పించింది. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు పి రామమూర్తి నాయకత్వం వహించారు.