S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పేరుపాలెం బీచ్‌లో ముగ్గురు గల్లంతు

మొగల్తూరు, జూలై 31: మండలంలోని పేరుపాలెం బీచ్‌లో సముద్ర స్నానంచేస్తూ ఇరగవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులు ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌కు ఆదివారం ఉదయం ఇరగవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన పది మంది ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు కలసి వచ్చారు. సముద్రం స్నానం చేస్తుండగా సముద్రంలో ఎగసి పడిన కెరటాలకు వారిలో ముగ్గురు గల్లంతవ్వడంతో సముద్రం ఒడ్డున గల స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. దాసరి కిరణ్ సుందర్, నూక పేయి సూర్యప్రకాష్‌లు గల్లంతవ్వగా మరోయువకుడిని స్థానికులు రక్షించగలిగారు. ఆ యువకుడిని వైద్య పరిక్షలు నిమిత్తం ప్రభుత్వాసుప్రతికి తరలించారు. సుందర్, సూర్యప్రకాష్‌ల కోసం సముద్రంలో గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. సముద్రంలో మునిగి గల్లంతైన కిరణ్ సుందర్, సూర్యప్రకాష్‌ల మృతదేహాలను రెండుగంటల తరువాత పోలీసులు కనుగొన్నారు. మృతిచెందిన కిరణ్ సుందర్, సూర్యప్రకాష్‌లు బావ, బావమరుదులుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కిరణ్‌కు భార్య లక్ష్మిప్రసన్నతోపాటు ఏడాది వయసుగల కుమారుడు ఉన్నాడు. మరో మృతుడు నూకపేయి సూర్యప్రకాష్ భీమవరం పట్టణంలో ఒక హోటల్లో పనిచేస్తుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే మొగల్తూరు ఎస్సై డిజె రత్నం తన సిబ్బందితో పేరుపాలెం బీచ్‌కు వచ్చి ఆరా తీశారు. గల్లంతైన దాసరి కిరణ్ సుందర్ (35), నూకపేయి సూర్యప్రకాష్ (20)ల కోసం సముద్రంలో గాలించగా కొద్దిసేపటికి ఇరువురి మృతదేహాలు గట్టుకు కొట్టుకు వచ్చాయి. పేరుపాలెం విఆర్వో కె వినోద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుందర్, సూర్యప్రకాష్ మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మొగల్తూరు పోలీసులు కేసు నమోదుజేసి దర్యాప్తు చేస్తున్నారు.