ప్రమాదాలకు తావులేకుండా చర్యలు : అసిస్టెంట్ కమిషనర్
Published Monday, 1 August 2016బాల్కొండ, జూలై 31: బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గోదావరి నది ఒడ్డున జరుగుతున్న అంత్య పుష్కరాలను ఎండోమెట్ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య ఆదివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా 1, 2, 3, 4పుష్కర ఘాట్లను పరిశీలించి, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆలయ ఇఒ గంగాధర్, చైర్మన్ సాగర్రెడ్డిలను ఆదేశించారు. అదే విధంగా భక్తులు స్నానాలు చేస్తున్న సమయంలో గజ ఈతగాళ్లను అప్రమత్తం చేసి, ప్రమాదాలు చోటు చేసుకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఉదయం నుండే కోదండరామస్వామి, రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగగా, ఆదివారం సుమారు 5వేల మంది పుణ్య స్నానాలు ఆచరించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.