చెట్టుకు ఢీకొన్న కారు
Published Monday, 1 August 2016దిల్సుఖ్నగర్, జూలై 31: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సంఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం...నగరంలోని వివిధ ప్రాంతాలలో నివాసముండే రూప (21), పవన్ (18), సౌమ్య (22), ప్రదీప్ (34) శనివారం రాత్రి నగరశివారు ప్రాంతమైన హయత్నగర్కు కారులో బయలుదేరారు. ప్రదీప్ కారును అతివేగంగా నడపడంతో అబ్దుల్లాపూర్ వద్ద చెట్టుకు ఢీకొని ప్రమాదానికి గురైంది. టిఎస్ 11 ఇజి 5943 నెంబర్గల కారులో ప్రయాణిస్తున్న రూపకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక అసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. రూప బిటెక్ తృతీయ సంవత్సరం చదువుతుండగా, పవన్ ఇంటర్ పూర్తి చేశాడు. సౌమ్య కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తోంది. ప్రదీప్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. రూప, పవన్ సొంత అక్కాతమ్ముళ్లు. మిగిలిన క్షతగాత్రులు కొత్తపేటలోని ఒనీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకుని బాదితులను ఆసుపత్రికి తరలించారు.