ఆటోలో నుంచి పడి బాలుడి మృతి
Published Monday, 1 August 2016ఓబుళదేవరచెరువు, జూలై 31: మండల పరిధిలోని జీవన జ్యోతి పాఠశాల వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అఖిలేష్(3) మృతి చెందినట్లు ఎస్ఐ మధుసూదనరెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు బాలుడు తండ్రి మహేంద్ర అనంతపురం నుంచి తన సొంత ఆటోలో తుమ్మలకుంటపల్లికి వెళ్తుండగా జీవన్ జ్యోతి పాఠశాల వద్ద వున్న స్పీడ్ బ్రేకర్ చూసుకోకుండా వేగంగా వెళ్లగా ఆటో అదుపు తప్పి అఖిలేష్ బండరాయిపై పడ్డాడు. హుటాహుటిన 108 అంబులెన్స్ ద్వారా కదిరికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.